ప్రతి క్షణం
ప్రజల పక్షం

  నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాల ద్వారా యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాం: మంత్రి నారా లోకేష్

నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాల ద్వారా యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాం: మంత్రి నారా లోకేష్

అమరావతి, ఆధాబ్ న్యూస్:
రాష్ట్రంలోని యువత నైపుణ్యాభివృద్ధి శిక్షణ ద్వారా ఉద్యోగావకాశాలను పొందేలా చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. నైపుణ్యాభివృద్ధి శాఖపై ఉండవల్లి నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, వచ్చే ఐదేళ్లలో లక్షల సంఖ్యలో ఉద్యోగ అవ‌కాశాలు కల్పించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని పేర్కొన్నారు.

సివిల్ డెవలప్మెంట్, కార్పొరేట్ రంగం, న్యాయ, సీఏ, ఓంకాలజీ వంటి విభాగాలలో నైపుణ్య శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నైపుణ్య పోర్టల్‌ను ‘సింగిల్ ప్లాట్‌ఫామ్’గా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు.

తద్వారా ఉద్యోగ కల్పనకు సంబంధించిన అన్ని రంగాల వారితో తార్కికమైన కుదుర్పాటు ఏర్పరిచి జిల్లా వారీగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ విద్యార్థులు బహుళపంథాల ద్వారా నైపుణ్య శిక్షణ పొంది ఉపాధిని పొందేలా ఈ కార్యక్రమాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు నారా లోకేష్ స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్