వడదెబ్బతో వృద్ధురాలు మృతి. కరకగూడెం ,ఆధాబ్ న్యూస్:
మండలంలోని తాటిగూడెం పంచాయతీ పరిధిలోని తాటిగూడెం గ్రామానికి చెందిన నడ్డి భద్రమ్మ (70) ఆదివారం వడదెబ్బకు గురై మృతి చెందిన ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. తీవ్ర ఎండల కారణంగా ఆమె అస్వస్థతకు గురై కుప్పకూలినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే చికిత్స నిమిత్తం తరలించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిసింది. గ్రామస్థులు భద్రమ్మ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు.
Post Views: 22









