ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కరకగూడెంలో పారిశుధ్య సమస్యలతో ప్రజల ఇబ్బందులు

కరకగూడెంలో పారిశుధ్య సమస్యలతో ప్రజల ఇబ్బందులు

ఆధాబ్ న్యూస్ , కరకగూడెం  మే 19:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో పారిశుధ్య సమస్యలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ప్రధాన రహదారుల వెంట ఉన్న కాల్వల్లో చెత్త పేరుకుపోవడంతో మురుగునీరు నిలిచిపోతోంది. దీంతో దుర్వాసన వ్యాపించి స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా దోమలు విపరీతంగా పెరగడంతో చిన్నపిల్లలు, వృద్ధులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రజలు చెబుతున్నారు.

కాల్వల శుభ్రత పనులు సక్రమంగా నిర్వహించకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎండాకాలంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే వర్షాకాలంలో ఇబ్బందులు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాల్వలను శుభ్రపరచి దోమల నివారణ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్