జూలూరుపాడు మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ పర్యటన
జూలూరుపాడు,ఆధాబ్ న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ పర్యటించారు. ఈ సందర్భంగా కేజీబీవీ పాఠశాలలో ఏర్పాటు చేసిన వేసవి శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. విద్యార్థులతో మాట్లాడి శిబిరం నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం దొండమిట్ట తండా ప్రాథమిక పాఠశాలలో రూ.2 లక్షల నిధులతో నిర్మించనున్న బాలుర మరుగుదొడ్డి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే పాపకొల్లు పీఎం శ్రీ ఉన్నత పాఠశాలలో రూ.1.10 లక్షల నిధులతో నిర్మించనున్న ఇంకుడు గుంత పనులకు కూడా శంకుస్థాపన చేశారు.
పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ తెలిపారు. అధికారులు పనులను నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు.
Post Views: 23









