ప్రతి క్షణం
ప్రజల పక్షం

  108 అంబులెన్స్ లేక ప్రజలకు అవస్థలు జానంపేట ప్రభుత్వ ఆసుపత్రికి వెంటనే 108 వాహనం ఏర్పాటు చేయాలి : సిపిఐ మండల కార్యదర్శి తోగటి కుమార్

108 అంబులెన్స్ లేక ప్రజలకు అవస్థలు
జానంపేట ప్రభుత్వ ఆసుపత్రికి వెంటనే 108 వాహనం ఏర్పాటు చేయాలి : సిపిఐ మండల కార్యదర్శి తోగటి కుమార్

ఆధాబ్ న్యూస్, పినపాక, మే 7:
పినపాక మండల కేంద్రంలోని జానంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 108 అంబులెన్స్ వాహనం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఐ మండల కార్యదర్శి తోగటి కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన అనంతరం స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చేతుల మీదుగా జానంపేట ఆసుపత్రికి 108 అంబులెన్స్ వాహనాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. ఏజెన్సీ ప్రాంతమైన పినపాక మండలంలో అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్ అందుబాటులో ఉంటే ఆక్సిజన్ తదితర వైద్య సదుపాయాలతో రోగుల ప్రాణాలను కాపాడటం సులభమవుతుందని తెలిపారు.

మండలంలోని పేద ప్రజలకు జానంపేట ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన వైద్య కేంద్రంగా మారిందని, ప్రతిరోజూ ఓపీ విభాగానికి అనేక మంది రోగులు వస్తున్నారని చెప్పారు. అత్యవసర చికిత్స అవసరమైన సమయంలో వైద్యులు జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేసినప్పటికీ ఆసుపత్రిలో అంబులెన్స్ లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు.

108 అంబులెన్స్‌కు ఫోన్ చేసినా సమయానికి రాకపోవడంతో రోగులను మెరుగైన చికిత్స కోసం దూర ప్రాంతాలకు తరలించేందుకు ప్రజలు ప్రైవేట్ వాహనాలను ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో ప్రైవేట్ వాహనాల డ్రైవర్లు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

ఇప్పటికైనా వైద్య ఉన్నతాధికారులు, స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్పందించి జానంపేట ప్రభుత్వ ఆసుపత్రికి శాశ్వతంగా 108 అంబులెన్స్ వాహనం ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని తోగటి కుమార్ కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్