డిస్ట్రిక్ట్ పంచాయతీ అధికారి (DPO)గా అదనపు బాధ్యతలు స్వీకరించిన డిఆర్డిఓ విద్యాచందన
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డిస్ట్రిక్ట్ పంచాయతీ అధికారి (DPO)గా డిఆర్డిఓ విద్యాచందన మంగళవారం అదనపు బాధ్యతలను అధికారికంగా స్వీకరించారు.
జిల్లా కేంద్రంలో జరిగిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో అధికారులు ఆమెకు పూల మొక్క అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లాలో పంచాయతీ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని విద్యాచందన ఈ సందర్భంగా తెలిపారు.
Post Views: 6








