ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలిచేది గులాబీ జెండానే: మలకం వెంకటేశ్వర్లు
కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలంలోని సమాత్ మోతె గొల్లగూడెం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ అధ్యక్షులు మలకం వెంకటేశ్వర్లు గులాబీ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలను దోచుకునే ప్రభుత్వం కొనసాగుతోందని విమర్శించారు. ప్రజలు ఆ ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికలు ఎప్పుడొచ్చినా గులాబీ జెండాను గెలిపించి, K. Chandrashekar Rao ను మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలనే సంకల్పంతో ఉన్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో యూత్ ప్రెసిడెంట్ గుల్ల రంజిత్ కుమార్, ఉప సర్పంచ్ ఇరుప కుచేలుడు, మాజీ ఉపసర్పంచ్ చేను సాంబయ్య, సీనియర్ నాయకులు సుతారి నాగేష్, వార్డు సభ్యులు ఇర్ప లక్ష్మి, ఇర్ప వంశీ, బోడ ముత్తయ్య, గోగు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.








