ప్రతి క్షణం
ప్రజల పక్షం

  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తుడుం దెబ్బ నూతన కమిటీ ఎన్నిక – కరకగూడెం నాయకత్వానికి కీలక స్థానాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తుడుం దెబ్బ నూతన కమిటీ ఎన్నిక – కరకగూడెం నాయకత్వానికి కీలక స్థానాలు

కరకగూడెం, ఏప్రిల్ 14 (ఆధాబ్ న్యూస్): డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తుడుం దెబ్బ సంస్థ నూతన కమిటీని ఘనంగా ఏర్పాటు చేశారు. పాల్వంచ పట్టణంలోని కొమరం భీమ్ భవనంలో నిర్వహించిన ఈ సమావేశానికి జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు హాజరయ్యారు.

హక్కుల పరిరక్షణలో భాగంగా మహనీయులను స్మరించుకుంటూ జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కరకగూడెం మండల నాయకత్వానికి ప్రముఖ స్థానం లభించింది.

జిల్లా ప్రధాన కార్యదర్శిగా పోలెబోయిన వెంకటనారాయణ ఎన్నిక కాగా, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కలం వేణుగోపాల్, ప్రచార కార్యదర్శిగా సుతారి నాగేశ్వరావు ఎంపికయ్యారు. అదేవిధంగా ASU ఉపాధ్యక్షుడిగా ఇర్ప నాగకృష్ణ ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తుడుం దెబ్బ సంస్థ ద్వారా గిరిజనులు మరియు బలహీన వర్గాల హక్కుల సాధన కోసం మరింత కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!