కరకగూడెం మండలంలో రేపు రెండు గంటల విద్యుత్ నిలిపివేత
కరకగూడెం, ఆధాబ్ న్యూస్: కరకగూడెం మండల ప్రజలకు విద్యుత్ శాఖ ముఖ్యమైన సమాచారం అందించింది. రేపు అనగా ఏప్రిల్ 11 (శనివారం)న 33/11 కేవీ కరకగూడెం ఉపకేంద్రములో మరమ్మత్తు పనులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో ఉదయం 09:00 గంటల నుండి 11:00 గంటల వరకు కరకగూడెం మండలం మొత్తం విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు.
అందువల్ల వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి విద్యుత్ నిలిపివేత సమయంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యుత్ శాఖకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
Post Views: 59








