ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మణుగూరులో నిర్మాణంలో ఉన్న నూతన పోలీస్ స్టేషన్ పరిశీలన.

మణుగూరులో నిర్మాణంలో ఉన్న నూతన పోలీస్ స్టేషన్ పరిశీలన.

మణుగూరు, ఏప్రిల్ 06 (ఆధాబ్ న్యూస్):
మణుగూరు పట్టణంలో నిర్మాణ దశలో ఉన్న నూతన పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ సోమవారం పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని ప్రత్యక్షంగా వీక్షించి, పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ప్రజలకు మరింత సౌకర్యవంతంగా, ఆధునిక సదుపాయాలతో పోలీస్ స్టేషన్‌ను రూపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. ప్రజలు సులభంగా చేరుకునే విధంగా, సేవలు సమర్థవంతంగా అందేలా నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐ శ్రీనివాసరావు, సీఐ నాగబాబు, ఎస్సై శ్రావణ్ కుమార్ తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్