మణుగూరులో నిర్మాణంలో ఉన్న నూతన పోలీస్ స్టేషన్ పరిశీలన.
మణుగూరు, ఏప్రిల్ 06 (ఆధాబ్ న్యూస్):
మణుగూరు పట్టణంలో నిర్మాణ దశలో ఉన్న నూతన పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ సోమవారం పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని ప్రత్యక్షంగా వీక్షించి, పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ప్రజలకు మరింత సౌకర్యవంతంగా, ఆధునిక సదుపాయాలతో పోలీస్ స్టేషన్ను రూపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. ప్రజలు సులభంగా చేరుకునే విధంగా, సేవలు సమర్థవంతంగా అందేలా నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐ శ్రీనివాసరావు, సీఐ నాగబాబు, ఎస్సై శ్రావణ్ కుమార్ తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
Post Views: 54









