ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఆటో ప్రమాదం… ప్రాణాపాయంలో చిన్నారి – తల్లి ఆర్తనాదం | ఒక చేయి సహాయం కోసం వేడుకుంటున్న తల్లి… చిన్నారి జీవితం సవాల్‌లో | చిన్నారి ప్రాణం కోసం పోరాటం… దాతల కోసం ఎదురు చూపు

ఆటో ప్రమాదం… ప్రాణాపాయంలో చిన్నారి – తల్లి ఆర్తనాదం | ఒక చేయి సహాయం కోసం వేడుకుంటున్న తల్లి… చిన్నారి జీవితం సవాల్‌లో | చిన్నారి ప్రాణం కోసం పోరాటం… దాతల కోసం ఎదురు చూపు
కరకగూడెం,ఆధాబ్ న్యూస్;

తాడ్వాయి ప్రాంతంలో చోటుచేసుకున్న విషాదకర ఘటన హృదయాలను కలిచివేస్తోంది. ఆటో బోల్తా పడిన ప్రమాదంలో గోగు రజితతో పాటు ఆమె చిన్నారి తీవ్రంగా గాయపడగా, ప్రస్తుతం ఇద్దరూ ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా చిన్నారి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో తల్లి ఆవేదన మాటల్లో చెప్పలేనిది.

శ్రీరంగాపురం గ్రామానికి చెందిన రజిత జీవితంలో కష్టాలు వరుసగా వెంటాడుతున్నాయి. మూడు నెలల క్రితమే భర్తను కోల్పోయి, ఇద్దరు చిన్నారులతో ఒంటరిగానే పోరాటం చేస్తూ జీవనం సాగిస్తోంది. కూలీ పనులు చేస్తేనే పూట గడిచే పరిస్థితిలో ఉన్న ఈ కుటుంబానికి, ఈ ప్రమాదం మరింత దెబ్బతీసింది.

ఇటీవల తాడ్వాయి గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఆటో బోల్తా పడడంతో రజిత, ఆమె చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు. మొదట వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించినప్పటికీ, చిన్నారి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

వైద్యులు చిన్నారి మెదడుకు తీవ్రమైన గాయం జరిగిందని, తక్షణమే ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇందుకు లక్షల్లో ఖర్చు అవుతుందని చెప్పడంతో, ఇప్పటికే ఆర్థికంగా బలహీన స్థితిలో ఉన్న రజిత కుటుంబం తీవ్ర ఆందోళనలో మునిగిపోయింది.

“నా బిడ్డను కాపాడండి… నాకు ఎవరూ లేరు” అంటూ రజిత ప్రతి ఒక్కరిని వేడుకుంటోంది. తల్లిదండ్రులు కూడా లేని ఆమె పరిస్థితి చూసి గ్రామస్తులు సైతం కదిలిపోయారు. మానవత్వం చాటుకుంటూ దాతలు ముందుకు రావాలని కోరుతున్నారు.

ఈ కష్టసమయంలో మనం అందరం కలిసివస్తే ఒక చిన్నారి ప్రాణం నిలబడే అవకాశం ఉంది.

సహాయం చేయదలచిన వారు ఫోన్‌పే ద్వారా 9573034048 నంబర్‌కు సంప్రదించి తమ వంతు సహాయం అందించవచ్చు.

ఒక్కో చేయి కలిస్తే… ఒక ప్రాణం నిలుస్తుంది.
మన చిన్న సహాయం… ఒక కుటుంబానికి కొత్త జీవం.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!