అనంతారంలో మెగా వైద్య శిబిరం
కరకగూడెం,ఏప్రిల్ 5 (ఆధాబ్ న్యూస్):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం అనంతారం గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఆదివారం మణుగూరు మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు.
ఈ శిబిరంలో మణుగూరు పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ కొమ్మ మధుసూదన్ రావు, డాక్టర్ బుడగం రామకృష్ణ, డాక్టర్ భవానీ, డాక్టర్ వీర శేఖర్, డాక్టర్ ఉమా శంకర్ పాల్గొని గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వివిధ రోగాలకు సంబంధించి పరీక్షలు చేసి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లో సేవ చేయడం ఎంతో సంతృప్తిని కలిగిస్తుందని తెలిపారు. ప్రజలు తమ ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా, సమస్యలు ఉన్నప్పుడు సమీప వైద్యశాలల్లో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మెడికల్ అసోసియేషన్ సభ్యులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









