ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మెహదీపట్నంలో కల్తీ ఆహార తయారీ బయటపడింది ఐస్ క్యాండీలు, లస్సీలు తయారు చేస్తున్న యూనిట్‌పై దాడి – నిందితుడు అరెస్ట్

హైద్రాబాద్, ఆధాబ్ న్యూస్:2 (ఆధాబ్ న్యూస్):
హైదరాబాద్‌లోని మెహదీపట్నం ప్రాంతంలో కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తున్న యూనిట్‌పై పోలీసులు దాడి చేసి నిర్వాహకుడు సయ్యద్ ముషారఫుద్దీన్‌ను అరెస్ట్ చేశారు. ఐస్ క్యాండీలు, లస్సీలు వంటి ఆహార పదార్థాలను నాసిరకంగా తయారు చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు.

పోలీసుల సమాచారం ప్రకారం, ఆరోగ్యానికి హానికరమైన పదార్థాలను ఉపయోగించి ఈ ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు అనుమానం వ్యక్తమవడంతో తనిఖీలు చేపట్టారు. దాడిలో కల్తీ పదార్థాలు స్వాధీనం చేసుకుని, యూనిట్‌ను మూసివేశారు.

ఇటీవల ఇదే తరహా ఘటనలు వరుసగా వెలుగులోకి రావడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ వారంలోనే రెండోసారి ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ప్రజలు, ముఖ్యంగా పిల్లలకు ఇచ్చే ఆహార విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు.

బయట తినేటప్పుడు పరిశుభ్రత, నాణ్యతను తప్పనిసరిగా పరిశీలించాలని, అనుమానాస్పద ఆహార పదార్థాలపై వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

ప్రజల ఆరోగ్యం వారి చేతుల్లోనే ఉందని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని అధికారులు హెచ్చరించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!