హైదరాబాద్లో జయలలిత భవనం సీజ్
హైద్రాబాద్,ఆధాబ్ న్యూస్:
హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో ఉన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలితకు చెందిన జీ+4 భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం సీజ్ చేశారు.
అధికారుల సమాచారం మేరకు, 2017 నుంచి చెల్లించని ఆస్తి పన్ను బకాయిలు రాయితీతో కలిపి రూ.82,91,822 వరకు పెండింగ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో Greater Hyderabad Municipal Corporation చర్యలు చేపట్టింది.
ఇప్పటికే ఈ ఏడాది ఫిబ్రవరిలో సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసినప్పటికీ, వారు స్పందించకపోవడంతో అధికారులు భవనాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు.
పన్నులు చెల్లించకపోతే కఠిన చర్యలు తప్పవని GHMC హెచ్చరించింది.
Post Views: 18









