కరకగూడెంలో ఘనంగా టిడిపి పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
కరకగూడెం,ఆధాబ్ న్యూస్ ప్రతినిధి:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని కరకగూడెం మండల కేంద్రంలో టిడిపి పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు సిరిశెట్టి కమలాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ సెల్ నాయకులు చందా రాఘవులు, పాయల్ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పార్టీ స్థాపన ప్రాధాన్యత, పార్టీ అభివృద్ధి ప్రయాణంపై వారు ప్రసంగించారు.
అలాగే ఈ వేడుకల్లో పార్టీ కార్యకర్తలు సిరిశెట్టి సాయితేజ తదితరులు పాల్గొని పార్టీ పట్ల తమ అంకితభావాన్ని చాటుకున్నారు. కార్యక్రమం మొత్తం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.
Post Views: 224









