సఫీయా మజీద్కు నూతన కమిటీ ఎంపిక
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండల కేంద్రంలో శుక్రవారం సఫీయా మజీద్లో ముస్లింల సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో మజీద్ కమిటీ నూతన సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా మజీద్ అధ్యక్షుడిగా పఠాన్ సాబేర్ ఖాన్, ఉపాధ్యక్షుడిగా షేక్ యాకూబ్ పాషా, కార్యదర్శిగా షేక్ యాకూబ్ పాషా, క్యాషియర్గా ఎస్ కే ఖలీల్, కోశాధికారిగా ఎస్ కే సోనీతో పాటు మరికొందరిని కమిటీ సభ్యులుగా ఎంపిక చేశారు.
నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ, మజీద్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని, ముస్లింలకు అన్ని విధాలుగా న్యాయం జరిగేలా పనిచేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పఠాన్ అక్బర్ ఖాన్, సాదిక్, సలీమ్, అజ్మత్, అఫ్రోజ్, రోహిత్, ఖలీల్, అజ్జు, ఇర్ఫాన్, జాహీద్, ఇలీయాజ్, రియాజ్, జలీల్, ఖలీమ్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 77









