దోమలవాగు నుంచి పంటపొలాలకు నీరు విడుదల
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం నకిరిపేట పరిధిలోని దోమలవాగు తూము ద్వారా దిగువనున్న పంటపొలాలకు నీటిని విడుదల చేశారు. పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రత్యేక చొరవతో ఈ చర్య చేపట్టారు.
సీతారామ ప్రాజెక్ట్ అనుసంధానంతో దోమలవాగును మినీ రిజర్వాయర్గా అభివృద్ధి చేసే దిశగా ముందడుగు వేస్తున్నారు. ఈ నీటి విడుదలతో లక్ష్మీపురం, సంజీవరెడ్డిపాలెం, బూర్గంపహాడ్, మొరంపల్లిబంజర, నకిరిపేట, గోపాలపురం, పోలవరం, కొమ్ము నకిరిపేట, వేపలగడ్డ ప్రాంతాలకు చెందిన సుమారు 700–800 ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు అందనుంది.
నీటి విడుదలతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుండగా, రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు.
Post Views: 64









