ఆదివాసి హక్కుల కోసం ఐక్యంగా పోరాటం చేయాలి: చందా లింగయ్య దొర
భద్రాద్రి కొత్తగూడెం,మార్చి 10 ఆధాబ్ న్యూస్ :ఆదివాసి రాజ్యాంగ హక్కులు అమలు చేసి “మా ఊర్లో మా రాజ్యం” సాధించేందుకు ఆదివాసీలు ఐక్యంగా పోరాటం చేయాలని ఆల్ ఇండియా ఆదివాసి రాజ్యాంగ హక్కుల పరిరక్షణ (JAC) జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య దొర పిలుపునిచ్చారు.
మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎస్.ఆర్. గార్డెన్లో నిర్వహించిన సెమినార్లో ఆయన మాట్లాడుతూ ఆదివాసి ప్రాంతాల్లో 1/70, పీసా, అటవీ హక్కుల చట్టాలను కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇసుక క్వారీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆదివాసి ప్రాంతాల అభివృద్ధికి వినియోగించాలని కోరారు.
సమావేశానికి పలువురు ఆదివాసి సంఘాల నాయకులు, ప్రతినిధులు హాజరయ్యారు.
Post Views: 13









