రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఎస్ఐలు
హైదరాబాద్,ఆధాబ్ న్యూస్: లంచం తీసుకుంటూ ఇద్దరు పోలీస్ సబ్ఇన్స్పెక్టర్లు ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా చిక్కిన ఘటన హైదరాబాద్లో వెలుగుచూసింది. ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐలు బాబునాయక్, ప్రమోద్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు.
ఒక కేసులో నిందితుడికి 41 నోటీసులు జారీ చేయడానికి సంబంధించి ఫిర్యాదుదారుడి నుండి రూ.1 లక్ష లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని బాధితుడు ఏసీబీ అధికారులకు తెలియజేయడంతో వారు పథకం ప్రకారం ఉచ్చు వేశారు.
ఫిర్యాదుదారుడి నుండి రూ.1 లక్ష లంచం తీసుకుంటున్న సమయంలోనే ఏసీబీ అధికారులు ఎస్ఐలు బాబునాయక్, ప్రమోద్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
ఈ ఘటనతో పోలీస్ శాఖలో కలకలం రేగింది. కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.









