నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని అనంతారం గ్రామంలో జరిగిన వివాహ వేడుకలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
అనంతారం గ్రామానికి చెందిన బోండ్ల వెంకన్న – నాగమణి దంపతుల ఏకైక కుమారుడు బోండ్ల రంజిత్ కుమార్ వివాహం నవితతో శుభ ముహూర్తంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ముత్యాల పందిరిలో ఒకటైన నూతన వధూవరులకు రేగా కాంతారావు అక్షింతలు వేసి ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య, అనంతారం గ్రామ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, బంధుమిత్రులు మరియు గ్రామస్థులు పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.









