ప్రతి క్షణం
ప్రజల పక్షం

  అనంతారం కాంప్లెక్స్‌లో ఘనంగా బాలా మేళా

అనంతారం కాంప్లెక్స్‌లో ఘనంగా బాలా మేళా

కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
విద్యార్థుల ప్రాథమిక భాషా, గణిత అభ్యాస నైపుణ్యాల పెంపుతో పాటు సృజనాత్మకత, ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో అనంతారం కాంప్లెక్స్ స్థాయిలో నిర్వహించిన “బాలా మేళా” కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో మండలంలోని పలు ప్రాథమిక పాఠశాలల నుంచి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థుల కోసం రాత పరీక్షలు, కథల వినిపింపు, చదవడం, గణిత నైపుణ్యాల ప్రదర్శన వంటి విద్యా మరియు సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు సిహెచ్ వసంత్ మాట్లాడుతూ, బాలా మేళా వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో నేర్చుకునే ఆసక్తిని పెంపొందించడంతో పాటు వారి ప్రతిభను వెలికితీసే వేదికగా నిలుస్తాయని తెలిపారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించడం అభినందనీయమని అన్నారు.

మండల విద్యాధికారి జి మంజుల మాట్లాడుతూ, కార్యక్రమ నిర్వహణలో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు చూపిన కృషిని ప్రశంసించారు. విద్యార్థుల అభ్యాస ఫలితాల మెరుగుదలలో ఇటువంటి కార్యక్రమాలు కీలకమని పేర్కొన్నారు.

పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.

మండల రిసోర్స్ పర్సన్స్ జె. వెంకటేశ్వర్లు, భావ్ సింగ్, ఆట యూనియన్ మండల అధ్యక్షులు కుమారస్వామి, యుటిఎఫ్ మండలాధ్యక్షులు కోట్ల సూర్యనారాయణతో పాటు ఉపాధ్యాయులు నారాయణ, రామస్వామి, సర్వేశ్వరరావు, వినోద్, వసంత, శకుంతల, సుప్రియ, ఉమ, సి ఆర్ పి విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!