భద్రాచలం వ్యాపారవేత్త కుమారుడి మృతి.. ఎమ్మెల్యే పరామర్శ
భద్రాచలం,ఫిబ్రవరి 28 ఆధాబ్ న్యూస్:భద్రాచలం పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కంబపాటి శ్రీనివాస్ కుమారుడు కంబపాటి జశ్వంత్ మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది.
విషయం తెలుసుకున్న వెంటనే స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి, ధైర్యం చెప్పి ఓదార్చారు.
మృతుడి కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం మేజర్ సర్పంచ్ పూనెం కృష్ణ, మండల నాయకులు రత్నం రమాకాంత్, నర్రా రాము, భీమవరపు వెంకటరెడ్డి, మహ్మద్ జిందా, లకవత్ వెంకటేశ్వర్లు, కొప్పుల శ్రీను, 12వ వార్డు సభ్యుడు కారం దుర్గారావు, యూత్ నాయకులు గాడి విజయ్, మాచినేని భాను, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.









