ప్రతి క్షణం
ప్రజల పక్షం

  వట్టివాగు ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి ప్రాజెక్టును సందర్శించిన రేగా కాంతారావు

వట్టివాగు ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి

ప్రాజెక్టును సందర్శించిన రేగా కాంతారావు

భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 25, ఆధాబ్ న్యూస్:

రైతులకు ఉపయోగపడే వట్టివాగు ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సూచించారు.

బుధవారం కరకగూడెం ఏజెన్సీ మండలంలోని చొప్పాల గ్రామ పంచాయితీ పరిధిలోని గొడుగుబండ సమీపంలో కొనసాగుతున్న వట్టివాగు ప్రాజెక్టును ఆయన పరిశీలించారు. రైతులు రెండు పంటలు పండించేందుకు ఈ ప్రాజెక్టును గత ప్రభుత్వ కాలంలో తన ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించామని తెలిపారు.

ప్రస్తుతం పనులు ఏ విధంగా కొనసాగుతున్నాయో సంబంధిత సిబ్బంది, కార్యకర్తలతో కలిసి సమీక్షించిన ఆయన, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూపర్వైజర్లకు సూచించారు.

ఈ కార్యక్రమంలో మండల నాయకులు, పార్టీ ప్రజా ప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్