ఏసీబీ అధికారులకు చిక్కిన మాదాపూర్ ఎస్ఐ
రూ.50 వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ హైద్రాబాద్,ఆధాబ్ న్యూస్:
మాదాపూర్ పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్ఐ వినయ్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఒక చీటింగ్ కేసులో నిందితుడిని జైలుకు పంపకుండా తప్పించేందుకు రూ.50 వేల లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం.
లంచం మొత్తాన్ని స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి ఎస్ఐ వినయ్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి.
ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
Post Views: 20









