ప్రతి క్షణం
ప్రజల పక్షం

  దమ్మపేటలో ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ చోరీ – ముగ్గురు నిందితులు అరెస్ట్

దమ్మపేటలో ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ చోరీ – ముగ్గురు నిందితులు అరెస్ట్
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో ట్రాన్స్ఫార్మర్‌ల నుంచి కాపర్ వైర్లు చోరీ చేస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు 90 కిలోల కాపర్ వైర్లు, వైర్ కట్టర్లు, గడ్డ పలుగు, మూడు సెల్‌ఫోన్లు మరియు ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం, అరెస్ట్ అయిన నిందితులు కాకినాడ జిల్లా‌కు చెందిన వారిగా గుర్తించారు. వీరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట, కరకగూడెం, ములకలపల్లి, ఈబయ్యారం గ్రామాల పరిధిలో ఉన్న ట్రాన్స్ఫార్మర్‌లలో కాపర్ వైర్లు చోరీ చేసినట్లు విచారణలో వెల్లడైంది.

ఈ కేసులో నిందితులను బొగ్గుల సాయి, కిషోర్ రెడ్డి, లక్ష్మణ్ రామకృష్ణారెడ్డి, కలేశావళి రమేష్, నాగముత్యం లను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్