తాటిగూడెంలో ముగ్గుల పోటీలు.. మహిళలను అభినందించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కరకగూడెం మండలం తాటిగూడెం గ్రామపంచాయతీలో ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, స్థానిక కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ముఖ్య అతిథిగా హాజరైన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముగ్గుల పోటీలను సందర్శించి మహిళలను అభినందించారు. విజేతలకు స్వయంగా బహుమతులు అందజేశారు. గ్రామీణ సంప్రదాయాలు, మహిళా శక్తిని ప్రతిబింబించే ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామ పెద్దలు, మహిళా సంఘాల ప్రతినిధులు, పోలీస్ విభాగం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 51









