ప్రతి క్షణం
ప్రజల పక్షం

  సమత్ మోతెలో ఆసక్తికర పరిస్థితి — బ్యాలెట్ ఓటుతో ‘బ్యాలెట్ పుల్లయ్య’ గెలుపు

సమత్ మోతెలో ఆసక్తికర పరిస్థితి — బ్యాలెట్ ఓటుతో ‘బ్యాలెట్ పుల్లయ్య’ గెలుపు

కరకగూడెం, డిసెంబర్ 12 (ఆధాబ్ న్యూస్):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని సమత్ మోతె (గొల్లగూడెం) గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎనిమిదో వార్డులో అరుదైన, ఆసక్తికర పరిస్థితి చోటుచేసుకుంది. ఇద్దరు వార్డు సభ్యులకు సమాన ఓట్లు రావడంతో ఫలితం బ్యాలెట్ ఓటుపై ఆధారపడింది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థిపై బీఆర్‌ఎస్ అభ్యర్థి మలకం పుల్లయ్య బ్యాలెట్ ఓటుతో అద్భుత విజయాన్ని అందుకున్నారు. ఒక్క ఓటు ఆధారంగా మారడంతో గ్రామంలో ఇది చర్చనీయాంశంగా మారింది.

దరువు సినిమాలో రవితేజ ఒకే ఒక్క ప్రాణంతో బతికే సన్నివేశం లాగే— ఈ వార్డులో కూడా పుల్లయ్య ఒకే ఓటుతో గెలుపు సాధించడంతో ప్రజలు ఆయనను సరదాగా “బ్యాలెట్ పుల్లయ్య” అని పిలుస్తున్నారు.

ఒక్క ఓటు ఎంత విలువైనదో ఈ వార్డు ఫలితం మరోసారి నిరూపించిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్