దొరికిన సొమ్మును బాధితుడికి తిరిగి అందజేసి ఓ కానిస్టేబుల్ నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు.
పినపాక,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న లక్ష్మణ్, ఆదివారం పినపాక మండలం జానంపేటలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్నాడు. ఈ సమయంలో ఆయన రహదారిపై ₹5,600 నగదు దొరికింది.
తక్షణమే ఆ మొత్తంపై పూర్తిస్థాయి విచారణ జరిపిన లక్ష్మణ్, ఆ డబ్బు ఓ లారీ డ్రైవర్ది అని గుర్తించారు. అనంతరం ఆయన్నే కనుగొని మొత్తాన్ని సురక్షితంగా అందజేశారు.
కానిస్టేబుల్ లక్ష్మణ్ నిజాయితీని స్థానికులు అభినందించగా, పలువురు ఆయన పనితీరును ప్రశంసిస్తూ మంచి పోలీస్కు ఇది నిజమైన ఉదాహరణ అన్నారు.
Post Views: 125









