పినపాక మండలంలో శనివారం పర్యటించనున్న మంత్రి సీతక్క
చందా వరప్రసాద్ గెలుపుకోసం ప్రత్యేక ప్రచారం
పినపాక, ఆధాబ్ న్యూస్:
పినపాక మండలంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క శనివారం మండలంలో పర్యటించనున్నారు. మల్లారం గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి చందా వరప్రసాద్ విజయం సాధించేందుకు ఆమె ప్రత్యేకంగా ప్రచారం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
గ్రామంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేందుకు మంత్రి సీతక్క, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇంటింటి ప్రచారంతో పాటు ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఇప్పటికే చందా వరప్రసాద్ అభ్యర్థిత్వానికి గ్రామస్థుల నుంచి మంచి స్పందన రావడంతో, మంత్రి సీతక్క పర్యటన ప్రచారానికి మరింత వేగం తీసుకురానుందని నాయకులు పేర్కొన్నారు.
అభ్యర్థి గెలుపుకోసం కీలకమైన ఈ ప్రచార కార్యక్రమంలో గ్రామస్థులు, స్థానిక నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ నేతలు కోరుతున్నారు.









