మోతే -పద్మాపురం మధ్య కల్వర్టు మరమ్మత్తులు – పోలీసు శాఖ ఆధ్వర్యంలో త్వరితగతిన పునరుద్ధరణ
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలంలోని
మోతే నుండి పద్మాపురం మధ్య రహదారిలో ఉన్న కల్వర్టు పక్కన ఏర్పడిన ప్రమాదకర గుంతలను పోలీస్ శాఖ స్వయంగా గుర్తించి పునరుద్ధరించడం జరిగింది. మంగళవారం ఈ మరమ్మత్తు పనులను కరకగూడెం మండలం ఎస్ఐ పి.వి.ఎన్. రావు ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించారు.
రహదారిపై లోతైన గుంతలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రమాదస్థితి ఏర్పడే అవకాశముండటంతో చర్యలకు దిగినట్లు ఎస్ఐ పి.వి.ఎన్. రావు తెలిపారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని, వెంటనే గుంతలు పూడ్చి రహదారిని సురక్షితంగా మార్చినట్లు తెలిపారు.
స్థానిక ప్రజలు ఈ త్వరిత స్పందనకు పోలీసు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
Post Views: 206









