ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఘనంగా బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు .

ఘనంగా బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు

కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివాసీ అమరుడు భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి వేడుకలను భట్టుపల్లి గ్రామంలోని కొమరం భీమ్ సెంటర్‌లో గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో బిర్సా ముండా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా పోలేబోయిన కృష్ణయ్య మాట్లాడుతూ, చిన్ననాటి నుంచే చదువులో చురుకైన బిర్సా ముండా, బ్రిటీష్ పాలనలో అమలు చేసిన జమిందారీ విధానానికి తీవ్రంగా వ్యతిరేకించి ‘ఉల్గులాన్’ ఉద్యమాన్ని ప్రారంభించిన విషయాన్ని స్మరించారు. “రాణి రాజ్యం అంతమై… మన రాజ్యం స్థాపించబడాలి” అనే బిర్సా నినాదం దేశవ్యాప్తంగా ఆదివాసీ సమాజానికి ప్రేరణగా నిలిచిందని పేర్కొన్నారు.

ఆయన చేసిన పోరాటాలను స్మరించుకుంటూ రాంచీలోని ఒక రైల్వే స్టేషన్‌కు బిర్సా ముండా పేరు నామకరణం చేయడం, అలాగే దేశ పార్లమెంట్‌లో ఆయన చిత్ర పాఠం ఏర్పాటు చేయడం గర్వకారణమని నాయకులు అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో కరకగూడెం జేఏసీ అధ్యక్షులు పోలేబోయిన వెంకటనారాయణ, ప్రధాన కార్యదర్శి కలం సాంబమూర్తి, కొమరం రామ్ గోపాల్, తుడుందెబ్బ అధ్యక్షులు పోలేబోయిన ప్రేమ్ కుమార్, ప్రధాన కార్యదర్శి కలం సంపత్, సంక్షేమ పరిషత్ అధ్యక్షులు చందా రామకృష్ణ, ఊకె నరేష్, పాయం నర్సింహారావు, కలం వేణుగోపాల్, ఇర్ప నాగకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!