మణుగూరు, ఆధాబ్ న్యూస్:
మణుగూరు మండలంలో ఇటీవల రెండు రాజకీయ పార్టీల మధ్య పార్టీ కార్యాలయం విషయంలో ఘర్షణ చోటుచేసుకున్న నేపథ్యంలో, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టడంపై కఠిన చర్యలు తీసుకుంటామని మణుగూరు ఎస్డిపిఓ వి. రవీందర్ రెడ్డి హెచ్చరించారు.
గత రెండు రోజులుగా కొంతమంది పార్టీ నేతలు, కార్యకర్తలు, వ్యక్తులు సోషల్ మీడియాలో వీడియోలు, పోస్టులు పెట్టి ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆయన తెలిపారు. ఇటువంటి చర్యలు శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈరోజు నుంచి సోషల్ మీడియాలో ప్రేరేపించే విధంగా పోస్టులు, వీడియోలు పెడితే వారి మీద చట్టపరమైన కేసులు నమోదు చేస్తాం,”
అని ఎస్డిపిఓ స్పష్టం చేశారు.
ప్రజలు, పార్టీ నాయకులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.
Post Views: 50









