మద్యం టెండర్ వల్ల ఉద్యోగం పోయింది..!
వైన్షాప్ టెండర్ దక్కడంతో పీఈటీ సస్పెన్షన్..!
మహబూబ్నగర్ ఆధాబ్ న్యూస్:
మహబూబ్నగర్ జిల్లా రాంనగర్ బాలికల ఉన్నత పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న పుష్ప అనే ఉపాధ్యాయురాలు ఉద్యోగం కోల్పోయింది. ఇటీవల ఆమె భర్త మద్యం టెండర్ వేయగా, వారికి ధర్మపూర్ వైన్షాప్ లక్కీ డిప్లో దక్కింది. దీనికి సంబంధించిన సంతకాలు అధికారుల సమక్షంలో చేసుకుని, తదనంతర ప్రక్రియలు కూడా పూర్తిచేశారు.
అయితే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మద్యం టెండర్లలో పాల్గొనరాదని నిబంధనలు ఉండడంతో, టెండర్ ఖరారు రోజునే ఓ వ్యక్తి దీనిపై అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అధికారులు సీరియస్గా తీసుకున్నారు.
విచారణ జరిపిన అధికారులు పుష్ప మద్యం టెండర్ దాఖలు నుంచి షాపు దక్కే వరకు చేసిన ప్రక్రియలకు సంబంధించిన అన్ని ఆధారాలు సేకరించారు. అనంతరం పరిశీలించిన జిల్లా విద్యాశాఖాధికారి ప్రవీణ్కుమార్ ఈరోజు పీఈటీ పుష్పను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.









