జూలూరుపాడు లో ప్రమాదం — ముగ్గురు విద్యార్థినులు గాయాలు
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలో ఈరోజు ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. సాధన కళాశాలకు చెందిన విద్యార్థినులు ప్రయాణిస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థినులు గాయపడ్డారు. వారిని స్థానికులు తక్షణం సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడిన విద్యార్థినుల పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు.
ప్రమాదం గల కారణాలు తెలియాల్సి ఉంది.
Post Views: 38









