ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ప్రజలకు అండగా గులాబీ జెండా గొల్లగూడెం, పద్మాపురం, అనంతారం గ్రామాల్లో బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ

ప్రజలకు అండగా గులాబీ జెండా

గొల్లగూడెం, పద్మాపురం, అనంతారం గ్రామాల్లో బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కేంద్ర పార్టీ నిర్ణయం మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశానుసారం గ్రామ గ్రామాన బీఆర్ఎస్ జెండా పండుగ కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా కరకగూడెం మండలంలోని పద్మాపురం, అనంతారం గ్రామాల్లో బీఆర్ఎస్ జెండాను ఎగరవేయడం జరిగింది.

పద్మాపురం గ్రామ కమిటీ అధ్యక్షులు తోలెం రామారావు మాట్లాడుతూ…
“కేసీఆర్ పాలనలోనే నిజమైన అభివృద్ధి జరిగింది. ప్రజలు మళ్లీ అదే అభివృద్ధిని కోరుకుంటున్నారు. అందుకే గులాబీ జెండా అభిమానం రోజు రోజుకీ పెరుగుతోంది” అన్నారు.

అనంతారం గ్రామ కమిటీ అధ్యక్షులు అత్తె నాగేశ్వరావు మాట్లాడుతూ…
“ప్రజల సమస్యలు తెలుసుకునేది, వాటిని పరిష్కరించేది బీఆర్ఎస్ మాత్రమే. తదుపరి ఎన్నికల్లో గులాబీ పార్టీనే విజయం సాధిస్తుంది” అని నమ్మకం వ్యక్తం చేశారు.

ఇదే క్రమంలో సమాత్ మోతె (గొల్లగూడెం) గ్రామంలో గ్రామ కమిటీ అధ్యక్షులు మలకం వెంకటేశ్వర్లు నాయకత్వంలో గులాబీ జెండా ఆవిష్కరణ జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
“కాంగ్రెస్ పార్టీ లేనిపోని హామీలతో ప్రజలను మోసం చేసింది. ప్రజలు మళ్లీ బీఆర్ఎస్‌పైనే విశ్వాసం పెడతారు. ఎన్నికలు ఎప్పుడైనా వచ్చినా గులాబీ సైన్యం సిద్ధంగానే ఉంది” అన్నారు.

“ఏ ఎన్నికైనా… గులాబీ సైన్యం సొంతం” నినాదాలతో కార్యక్రమాలు ఉత్సాహంగా జరిగాయి.

ఈ కార్యక్రమాల్లో మాజీ ప్రజాప్రతినిధులు, మండల యూత్ ప్రెసిడెంట్ గుడ్ల రంజిత్ కుమార్, పార్టీ కో-ఆర్డినేటర్ సుతారి నాగేష్, బట్టా బిక్షపతి, ఇర్ప సత్యం, ఇర్ప నాగేష్, కుంజ లక్ష్మయ్య, అంజయ్య, పుల్లయ్య, ఆదినారయణ, రమేష్, కుమారస్వామి, వంశీ, కుషేలుడు, మహిళా నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!