మావోయిస్టుల బంద్ పిలుపు నేపథ్యంలో వాహనాల తనిఖీలు
కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండల పరిధిలో మావోయిస్టుల బంద్ పిలుపు నేపథ్యంలో భద్రతా చర్యలను బలపరిచిన పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎస్సై పి.వి.ఎన్. రావు ఆధ్వర్యంలో ప్రధాన రహదారులు, గ్రామీణ ప్రాంతాల వద్ద వాహనాలను ఆపి తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా అనుమానాస్పద వ్యక్తులను పోలీసులు నిలిపి వివరాలు సేకరిస్తున్నారు. ప్రజలు సహకరించాలని, ఎటువంటి అనుమానాస్పద చలనం గమనించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై పి.వి.ఎన్. రావు కోరారు.
Post Views: 102









