ప్రతి క్షణం
ప్రజల పక్షం

కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు

  జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన శ్రీతేజకు ఘన సన్మానం

జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన శ్రీతేజకు ఘన సన్మానం

కరకగూడెం,ఆధాబ్ న్యూస్: కరకగూడెం మండలంలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన తోలెం వెంకటేశ్వర్లు–మల్లేశ్వరి దంపతుల కుమార్తె శ్రీతేజ జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకం సాధించి ప్రాంతానికి గర్వకారణంగా నిలిచింది. డిగ్రీ చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తున్న ఆమె, ఇటీవల ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లో జరిగిన జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ చాటుతూ స్వర్ణ పతకం గెలుచుకుంది.

ఈ సందర్భంగా మంగళవారం కరకగూడెం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శ్రీతేజకు ఘన సన్మానం నిర్వహించారు. కార్యక్రమంలో మాట్లాడిన నాయకులు శ్రీతేజ భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి, దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షుడు కొమరం సాంబశివరావు, వైస్ ప్రెసిడెంట్ నిట్టా సౌందర్య రావు, సెక్రటరీ గుడ్ల రంజిత్ కుమార్, క్యాషియర్ సాధనపెల్లి లక్ష్మినారాయణ, సభ్యులు రావుల వేణు, కాటి సాంబశివరావు, ముత్యాల మధు, నిట్టా వెంకన్న, తోట శివ, బాదె సాగర్, ఓంకార్, శ్రావణ్, అలాగే కరకగూడెం పంచాయితీ సెక్రటరీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….