ప్రతి క్షణం
ప్రజల పక్షం

  నిజామాబాద్‌లో ఎన్‌కౌంటర్: కానిస్టేబుల్ హత్య నిందితుడు రియాజ్ హతం

నిజామాబాద్‌లో ఎన్‌కౌంటర్ కానిస్టేబుల్ హత్య నిందితుడు రియాజ్ హతం

నిజామాబాద్‌,ఆధాబ్ న్యూస్:
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి సీసీఎస్‌ కానిస్టేబుల్‌ను హత్య చేసిన నిందితుడు, పాత నేరస్థుడు రియాజ్‌ను పోలీసులు సోమవారం ఉదయం ఎన్‌కౌంటర్ చేశారు.

వివరాల్లోకి వెళితే, రియాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం ఉంచారు. ఈ క్రమంలో కాపలా కాస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ వద్ద నుండి తుపాకీ లాక్కొని అక్కడే ఉన్న వారిపై కాల్పులు జరపడానికి యత్నించాడు. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఎవరికి ప్రాణనష్టం కలగకుండా స్పందించి రియాజ్‌పై కాల్పులు జరిపారు. దీంతో రియాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు.

గతంలో 15 హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న రియాజ్, ఇటీవల డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌ను హత్య చేసిన ఘటనతో మళ్లీ చర్చనీయాంశమయ్యాడు. ఈ ఘటనతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ప్రాంతాన్ని ముట్టడి చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్