నిజామాబాద్లో ఎన్కౌంటర్ కానిస్టేబుల్ హత్య నిందితుడు రియాజ్ హతం
నిజామాబాద్,ఆధాబ్ న్యూస్:
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి సీసీఎస్ కానిస్టేబుల్ను హత్య చేసిన నిందితుడు, పాత నేరస్థుడు రియాజ్ను పోలీసులు సోమవారం ఉదయం ఎన్కౌంటర్ చేశారు.
వివరాల్లోకి వెళితే, రియాజ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం ఉంచారు. ఈ క్రమంలో కాపలా కాస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ వద్ద నుండి తుపాకీ లాక్కొని అక్కడే ఉన్న వారిపై కాల్పులు జరపడానికి యత్నించాడు. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఎవరికి ప్రాణనష్టం కలగకుండా స్పందించి రియాజ్పై కాల్పులు జరిపారు. దీంతో రియాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు.
గతంలో 15 హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న రియాజ్, ఇటీవల డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ను హత్య చేసిన ఘటనతో మళ్లీ చర్చనీయాంశమయ్యాడు. ఈ ఘటనతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ప్రాంతాన్ని ముట్టడి చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు.









