ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మాదక ద్రవ్య రహిత జిల్లాగా భద్రాద్రి కొత్తగూడెం: ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ “Say No to Drugs – Yes to Life” నినాదంతో ‘చైతన్యం’ అవగాహనా కార్యక్రమం ప్రారంభం

మాదక ద్రవ్య రహిత జిల్లాగా భద్రాద్రి కొత్తగూడెం: ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

“Say No to Drugs – Yes to Life” నినాదంతో ‘చైతన్యం’ అవగాహనా కార్యక్రమం ప్రారంభం
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను మాదక ద్రవ్య రహిత జిల్లాగా మార్చే లక్ష్యంతో జిల్లా పోలీసులు “చైతన్యం” పేరుతో నెలరోజుల పాటు అవగాహనా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

జిల్లా పోలీసు అధికారి రోహిత్ రాజు ఐపీఎస్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ డ్రగ్స్‌కు ‘నో’, లైఫ్‌కి ‘యెస్’ చెప్పాలి. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్తును కాపాడుకోవాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను డ్రగ్‌-ఫ్రీ డిస్ట్రిక్ట్‌గా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,” అని పిలుపునిచ్చారు.నెలరోజుల పాటు అవగాహనా కార్యక్రమాలు

అక్టోబర్ 15 నుండి నవంబర్ 15 వరకు జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, ప్రజా ప్రదేశాల్లో అవగాహనా ర్యాలీలు, సదస్సులు, పోస్టర్ ప్రచారాలు నిర్వహించనున్నట్లు ఎస్పీ తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ “చైతన్యం” పోస్టర్లను ఆవిష్కరించారు. మత్తు పదార్థాల నిర్మూలనలో ప్రజల సహకారం కీలకమని ఆయన అన్నారు.
గంజాయి రవాణాపై కఠిన చర్యలు

ఎస్పీ తెలిపారు — జిల్లాలోని మత్తు పదార్థాల హాట్‌స్పాట్ ప్రాంతాల్లో నిత్య తనిఖీలు, రైడ్లు, అవగాహనా కార్యక్రమాలు నిర్వహించనున్నామని చెప్పారు.మత్తు పదార్థాలు సేవిస్తున్నా, రవాణా చేస్తున్నా లేదా విక్రయిస్తున్నా వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు. ఎవరికైనా సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలపండి,” అని ఆయన విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు

ఈ కార్యక్రమంలో ఇల్లందు డీఎస్పీ చంద్రభాను, కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ రమాకాంత్, ఎస్సైలు ప్రవీణ్, రామారావు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!