ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మహాత్మ జ్యోతి పూలే విద్యార్థికి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు అవకాశం

మహాత్మ జ్యోతి పూలే విద్యార్థికి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు అవకాశం
మణుగూరు, అక్టోబర్ 15: ఆధాబ్ న్యూస్
ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయి SGF అండర్–14 కబడ్డీ బాలురుల ఎంపిక పోటీలు ఈ నెల 14న ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించబడ్డాయి. ఈ ఎంపికల్లో అద్భుత ప్రతిభ కనబరిచి జిల్లా జట్టులో స్థానం సంపాదించిన మణుగూరు మహాత్మ జ్యోతి పూలే హైస్కూల్ విద్యార్థి అల్లం శివ (9వ తరగతి) రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు అర్హత సాధించాడు.

రాష్ట్ర స్థాయి పోటీలు ఈ నెల 16, 17, 18 తేదీలలో సంగారెడ్డిలో జరగనున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ రజనీ మేడం, ఉమ్మడి ఖమ్మం జిల్లా RCO CH. రాంబాబు, DCO బ్యూలా రాణి, వ్యాయామ ఉపాధ్యాయులు ముంజాల సురేష్, వ్యాయామ దర్శకులు P. వెంకట్రావు, ATP మంద శంకర్ మరియు అధ్యాపక బృందం అల్లం శివకు అభినందనలు తెలియజేశారు.

పాఠశాల ప్రతిష్టను పెంచిన అల్లం శివను అందరూ అభినందిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!