అనారోగ్యంతో బాధపడుతున్న అనాథ యువకుడి ఆర్థిక సహాయం కోసం ఎదురు చూపు. కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలం, ముత్తారం గ్రామానికి చెందిన పోలేబోయిన లక్ష్మణ్ (బన్ని) అనే 19 ఏళ్ల యువకుడు ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో పోరాడుతున్నాడు.చిన్న వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఈ యువకుడు పూర్తిగా అనాధగా జీవనం సాగిస్తున్నాడు.
ప్రస్తుతం లక్ష్మణ్ ఏటూరునాగారం లోని న్యూ వాన్ అపోలో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే ఎక్కువ మొత్తంలో వైద్య ఖర్చులు అయ్యాయని, ఇకపై చికిత్స కొనసాగించేందుకు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ నేపథ్యంలో లక్ష్మణ్ సోదరుడు పోలేబోయిన అరవింద్ సామాజిక సేవా మనస్కులైన దయా హృదయులు ముందుకు వచ్చి తమకు తోచినంత ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
సహాయం అందించదలచిన వారు PhonePe నంబర్: 7989138351 ద్వారా సహకారం అందించవచ్చు.
ఒక యువ ప్రాణాన్ని కాపాడటానికి మీ చిన్న సహాయం కూడా ఎంతో విలువైనది.









