మణుగూరు – సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభం
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
మణుగూరు రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ఇప్పటివరకు మణుగూరు నుండి చర్లపల్లి వరకు నడుస్తున్న 12746 సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు ఇకపై సికింద్రాబాద్ వరకు విస్తరించనుంది. ఈ మార్పు బుధవారం (10-09-2025) నుండి అమల్లోకి వస్తుందని రైల్వే అధికారులు తెలిపారు.
తిరుగు ప్రయాణంలో అదే రైలు నెంబర్ 12745 సికింద్రాబాద్ – మణుగూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్గా నడుస్తుంది. ప్రయాణికులు ఈ మార్పును గమనించి తమ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఈ నిర్ణయం వల్ల మణుగూరు ప్రాంతం నుండి నేరుగా సికింద్రాబాద్ చేరుకునే సౌకర్యం లభించనుండటంతో, రైల్వే ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Post Views: 27









