భద్రాద్రి జిల్లా SP ఎదుట లొంగిపోయిన 8 మంది మావోయిస్ట్ దళ సభ్యులు
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ కార్యాలయంలో నేడు ఎనిమిది మంది నిషేధిత CPI మావోయిస్ట్ దళ సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోయారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ IPS ఎదుట జరిగిన ఈ లొంగుబాటు కార్యక్రమంలో ఏడూళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. గత కొంతకాలంగా అరణ్యప్రాంతాల్లో చురుకుగా కార్యకలాపాలు నిర్వహించిన ఈ సభ్యులు, ప్రభుత్వ పునరావాస పథకాలు మరియు సాధారణ జీవనానికి తిరిగి రావాలనే ఉద్దేశంతో లొంగుబాటు చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ, లొంగుబాటు చేసిన వారికి ప్రభుత్వం అందించే అన్ని సదుపాయాలు కల్పించబడతాయని, మిగిలిన మావోయిస్ట్ దళ సభ్యులు కూడా శాంతియుత జీవనాన్ని ఎంచుకోవాలని పిలుపునిచ్చారు.
Post Views: 44









