ప్రతి క్షణం
ప్రజల పక్షం

ప్రజావాణికి పలువురు అధికారులు డుమ్మా కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం.

  మణుగూరులో ఓసి విస్తరణపై నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోరిన సామాజిక సేవకులు

మణుగూరులో ఓసి విస్తరణపై నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోరిన సామాజిక సేవకులు

మణుగూరు,ఆధాబ్ న్యూస్:
మణుగూరు ఓపెన్‌కాస్ట్ (OC) విస్తరణకు సంబంధించి నిర్వాసితుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని సామాజిక సేవకులు కర్నే బాబురావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన అడిషనల్ కలెక్టర్ డి. వేణుగోపాల్ కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన కర్నే బాబురావు మాట్లాడుతూ, మణుగూరు ఓసి విస్తరణ అవసరమని ప్రజాభిప్రాయ సేకరణ సభలో తాము సానుకూలంగా స్పందించినప్పటికీ, నిర్వాసితుల సమస్యలను పట్టించుకోవాలని కోరుతున్నామని తెలిపారు.

ప్రధాన డిమాండ్లు:

నిర్వాసిత గ్రామాల వారికి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులుగా పూర్తి స్థాయిలో ఉపాధి కల్పించాలి.

స్థానిక SMS ప్లాంట్లు (బ్లాస్టింగ్ విభాగం) లో బహిర్గత ప్రాంతాల నుంచి కార్మికులను నియమిస్తున్నారని నిర్వాసితుల ఆరోపణలపై విచారణ జరిపి, తప్పుదారులు పట్టే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి.

స్థానిక ఓబీ కంపెనీలలో పనికి వెళ్లిన నిర్వాసితులను “లోకల్ వాలెంకో ఇదర్ కామ్ నహీ మిల్తా, బాహర్ జావో” అంటూ తిరస్కరిస్తున్నారని ఆరోపించారు. దీన్ని ఆపాలని, స్థానికులను పనిలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సివిల్ పర్చేస్ టెండర్లలో కూడా నిర్వాసితులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి.

శిక్షణ పూర్తి చేసుకున్న అనేక మంది యువత, మహిళలు పని కోసం తిరుగుతున్నా ఉపాధి దొరకక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ప్రధాన అభ్యర్థన:
సింగరేణి ఎండి ఎన్. బలరాం ఇచ్చిన ఆదేశాల ప్రకారం, స్థానికులు, సింగరేణి కుటుంబాలకు చెందిన నిరుద్యోగులకు 80% ఉపాధి అవకాశాలు కల్పించేలా ఏరియా సింగరేణి యాజమాన్యం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….