ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మేడారం మహా జాతరకు రూ.150 కోట్లు మంజూరు

మేడారం మహా జాతరకు రూ.150 కోట్లు మంజూరు

హైదరాబాద్,ఆధాబ్ న్యూస్:
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర ఏర్పాట్లకు తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. రాబోయే 2026 జనవరిలో జరగనున్న మహా జాతర కోసం రూ.150 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నిధులను శాశ్వత నిర్మాణాలు, రహదారి విస్తరణ, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్య సౌకర్యాలు, వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లు వంటి కార్యక్రమాలకు వినియోగించనున్నారు. లక్షలాది మంది భక్తులు ఈ జాతరకు హాజరయ్యే దృష్ట్యా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఇప్పటికే ఏర్పాట్ల ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ప్రతి రెండేళ్లకొకసారి జరిగే మేడారం జాతరకు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలనుంచి కూడా కోట్లాది మంది భక్తులు తరలివస్తారు. ఆ తాకిడిని దృష్టిలో ఉంచుకొని మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

జాతర సమయంలో రవాణా సౌకర్యాలు, తాత్కాలిక వసతి గృహాలు, అత్యవసర వైద్య కేంద్రాలు, భద్రతా సిబ్బంది నియామకం వంటి అంశాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.

గిరిజన సంప్రదాయాలను ప్రతిబింబించే మేడారం జాతర ప్రతి సారి చారిత్రాత్మకంగా మారుతుండటంతో, ఈసారి మరింత భవ్యంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!