ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మూడురోజుల పాటు భారీ వర్షాలు… తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్!

మూడురోజుల పాటు భారీ వర్షాలు… తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్!

హైదరాబాద్, జూలై 22: ఆధాబ్ న్యూస్:
తెలంగాణ రాష్ట్రంలో మూడురోజుల పాటు వర్ష బీభత్సం కొనసాగనుంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా, మరికొన్ని జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే మూడు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్
ఈ రోజు (జూలై 22) కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.

ఆరెంజ్ అలర్ట్ పొందిన జిల్లాలు
అదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది.

రేపటి వర్ష సూచన
జూలై 23న నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తరువాతి రోజుల్లో పరిస్థితి
జూలై 24 నుంచి 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!