ప్రతి క్షణం
ప్రజల పక్షం

  జూలై 27న గిరిజన అభ్యుదయ సంఘం జిల్లా కమిటీ ఎన్నికలు.

జూలై 27న గిరిజన అభ్యుదయ సంఘం జిల్లా కమిటీ ఎన్నికలు.
భద్రాచలం,ఆధాబ్ న్యూస్: జాతీయ ఆదివాసి గిరిజన అభ్యుదయ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కమిటీని ఈ నెల 27న భద్రాచలంలో నిర్వహించనున్న ప్రత్యేక సమావేశంలో ఎన్నుకోనున్నారు.

ఈ కార్యక్రమానికి సంఘం వ్యవస్థాపకుడు, జాతీయ అధ్యక్షుడు చందా లింగయ్య దొర (MA, M.Phil) ప్రత్యేక అతిథిగా హాజరవుతారు. ఆయన సమక్షంలో జిల్లా స్థాయి నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించనున్నారు.

జిల్లాలోని వివిధ మండలాల నుండి గిరిజన అభ్యుదయ సంఘంలో కొనసాగుతున్న మండల, డివిజన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కమిటీ సభ్యులు, మహిళా సంఘాల నాయకురాళ్లు, యువజన సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని ఎన్నికలను విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమం జూలై 27వ తేదీ ఉదయం 10:30 గంటలకు, గిరిజన అభ్యుదయ భవనం, భద్రాచలం-చర్ల రోడ్డులో ప్రారంభమవుతుంది.

ఈ కమిటీ ఎన్నికల ద్వారా జిల్లాలో సమర్థవంతమైన నాయకత్వాన్ని ఏర్పాటు చేసి గిరిజన సమాజ అభ్యున్నతికి మరింత బలోపేతంగా పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!