ప్రతి క్షణం
ప్రజల పక్షం

  విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేసిన ఆధార్ సంస్థ

విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేసిన ఆధార్ సంస్థ

కరకగూడెం, జూలై 9 (ఆధాబ్ న్యూస్):
కరకగూడెం మండలం కొత్తగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని కొరం వారి గుంపు గ్రామంలోని జి.పి.ఎస్. పాఠశాలలో మంగళవారం స్కూల్ బ్యాగ్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆధార్ సంస్థ ఆధ్వర్యంలో గూంజ్ సంస్థ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మొత్తం 12 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నోట్ బుక్స్, పెన్స్, పెన్సిల్స్, కంపాస్, వాటర్ బాటిల్స్, ఏరేజర్లు వంటి విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో ఆధార్ సంస్థ వ్యవస్థాపకుడు తోలెం రమేష్, పాఠశాల ఉపాధ్యాయులు ఇర్ప క్రిష్ణయ్య స్వయంగా విద్యార్థులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన తోలెం రమేష్, “పిల్లలు ప్రతిరోజూ పాఠశాలకు హాజరై మంచి చదువు చదివి తల్లిదండ్రులకు, గురువులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలి” అని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో ఆధార్ సంస్థ సభ్యులు, వాలంటీర్లు బట్ట బిక్షపతి, కుంజా రాము, అంగన్వాడీ టీచర్ కొమరం శిరీష, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!