ప్రతి క్షణం
ప్రజల పక్షం

  అరుణాచలం గిరి ప్రదక్షణకు మణుగూరు నుండి సూపర్ లగ్జరీ బస్సు – డిపో మేనేజర్ కె. శ్యాంసుందర్

అరుణాచలం గిరి ప్రదక్షణకు మణుగూరు నుండి సూపర్ లగ్జరీ బస్సు – డిపో మేనేజర్ కె. శ్యాంసుందర్

మణుగూరు, ఆధాబ్ న్యూస్:
భక్తుల కోసం ప్రత్యేక సౌకర్యంగా మణుగూరు ఆర్టీసీ డిపో నుండి సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటుచేసినట్టు డిపో మేనేజర్ శ్రీ కె. శ్యాంసుందర్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ యాత్ర 8-7-2025 సాయంత్రం 6 గంటలకు మణుగూరునుండి బయలుదేరి, భద్రాచలం, కొత్తగూడెం మార్గంగా కానిపాకం శ్రీ విఘ్నేశ్వర స్వామి దర్శనం అనంతరం శ్రీ పురం గోల్డెన్ టెంపుల్ దర్శనం చేస్తుంది. అనంతరం గురుపౌర్ణమి నాడు 10-7-2025 న తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకొని తిరిగి మణుగూరు చేరుకుంటుంది.

ఈ పుణ్యయాత్ర టూర్లో పెద్దలకు రూ.5500, పిల్లలకు రూ.2750 మాత్రమేగా టికెట్ ధరగా నిర్ణయించబడినది. సీట్లు పరిమితంగా ఉన్నాయి కాబట్టి భక్తులు ముందస్తుగా రిజర్వేషన్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు:
📞 99592 25963
📞 73828 58121
📞 63053 35304

ఆన్లైన్లో టిక్కెట్లు రిజర్వ్ చేసుకోవచ్చు. రిజర్వేషన్ నెంబర్: 55444

ఈ సదవకాశాన్ని మణుగూరు మరియు పరిసర ప్రాంత భక్తులు వినియోగించుకోవాలని డిపో అధికారులు కోరుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్