కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో బుధవారం మండల స్థాయి “స్వచ్ఛ మిత్రులు” కు శిక్షణా కార్యక్రమం నిర్వహించబడింది. కోర్స్ డైరెక్టర్ జి. మంజుల అధ్యక్షత వహించిన ఈ సమావేశాన్ని ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని 25 మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు, 3 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల స్వచ్ఛ మిత్రులకు శిక్షణ ఇవ్వడం ఎంతో అవసరమని, వారు పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో కీలక బాధ్యత వహించాలన్నారు. పాఠశాలలో మొక్కలు పెంపకం, టాయిలెట్లు పరిశుభ్రంగా ఉంచడం, అలాగే ఖాళీ ప్రదేశాలను కిచెన్ గార్డెన్లుగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఈ శిక్షణ ఇవ్వబడినట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల రిసోర్స్ పర్సన్లుగా జే. వెంకటేశ్వర్లు, బి. బావ సింగ్, కె. సూర్యనారాయణలతో పాటు మండల విద్యా కార్యాలయ సిబ్బంది గురువయ్య, జయబాబు, విష్ణుమూర్తి పాల్గొన్నారు.









